E-Paper
Advertisement

Case on YCP Perni Nani’s Wife: రేషన్ గోడౌన్ లో గోల్ మాల్.. మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు నమోదు..

Case on YCP Perni Nani’s Wife: రేషన్ గోడౌన్ లో గోల్ మాల్.. మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు నమోదు..
Advertisement

Case on YCP Perni Nani’s Wife: మాజీ మంత్రి పేర్ని నాని ఇక చుక్కలేనా.. ఆయన సతీమణిపై కేసు నమోదు కాగా, పోలీసులు అసలు విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఇంతకు ఏంటా కేసు? అసలేం జరిగిందో తెలుసుకుందాం.

వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు పేర్ని నాని. అధికారంలో ఉన్న సమయంలో సైతం మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు నాని. అధికారంలో ఉన్న సమయంలో సూటి విమర్శలతో నిరంతరం వార్తల్లో నిలిచేవారు ఈయన. ప్రస్తుతం అధికారం కోల్పోయింది వైసీపీ. అధికార పక్షంలో ఉన్న కూటమిపై నాని విమర్శలు మాత్రం అదే రీతిలో సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన నాని, రాజకీయ విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. అలాగే వైసీపీ లక్ష్యంగా ఎవరైనా విమర్శలు చేశారంటే చాలు.. ముందు మీడియా ముందు వాలిపోయేది కూడా ఈయనే.

Advertisement

అటువంటి పేర్ని నానికి భారీ షాక్ తగిలింది. ఏకంగా నాని సతీమణిపై కేసు నమోదు కాగా, ఆ కేసు కూడా రేషన్ బియ్యంకు సంబంధించి కావడం విశేషం. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేరిట బందరు పట్టణంలో ఓ గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ ను 2020 లో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం లీజుకు తీసుకుంది.

ఇక్కడ సివిల్ సప్లై శాఖ పరిధిలోని రేషన్ బియ్యంను నిల్వ ఉంచుతారు. అయితే ఇటీవల జరిపిన తనిఖీలలో, గోడౌన్ లో గల సుమారు రూ. 90 లక్షల విలువైన రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం పై సివిల్ సప్లై అధికారులు సీరియస్ అయ్యారు. మాయమైన బియ్యానికి రెండింతలు అంటే, ఒక కోటి 80 లక్షల రూపాయలు చెల్లించాలని సివిల్ సప్లై శాఖ సీఎండీ ఆదేశాలు జారీ చేశారట.

Advertisement

ఇది ఇలా ఉంటే పేర్ని నాని నవంబర్ 27వ తేదీన జేసీకి గోడౌన్ కు సంబంధించి లేఖ రాశారు. తమ గోడౌన్ కు 3200 బస్తాల మేర తరుగు వచ్చిందని అధికారులకు నాని ఫిర్యాదు చేశారు. ఆ తరుగు సంబంధించిన బియ్యానికి వెలకట్టి తాను మిగిలిన డబ్బులు చెల్లిస్తానని లేఖ రాశారని సమాచారం. ఆ లేఖతో రంగంలోకి దిగిన అధికారులు అసలు చిట్టా బయటకు తీశారట. రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ గత నెల చివరన, ఈ నెల మొదటి వారంలో తరుగును వెలకట్టారు.

Also Read: Indian Railway Rule: రైలు ఆగిందని.. కాలక్షేపానికి కిందకు దిగితే ఇక అంతే, ఈ రూల్ తెలియకపోతే కష్టాలే!

దీని విలువ దాదాపు 89 లక్షల 72 వేలుగా తేల్చారు. ఇప్పటిదాకా 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందని కూడా వారు ప్రకటించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి అధ్వర్యంలో విచారణ కొనసాగించి నివేదికను సంబంధిత అధికారులకు అందజేశారు. అలాగే ఫిర్యాదు కూడా చేయడంతో నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×