E-Paper
Advertisement

Pithapuram Caste Discrimination: పిఠాపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ‘మీది వెదవ జాతి’ అంటున్నారని టీచర్లపై ఫిర్యాదు

Pithapuram Caste Discrimination: పిఠాపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ‘మీది వెదవ జాతి’ అంటున్నారని టీచర్లపై ఫిర్యాదు
Advertisement

Pithapuram Caste Discrimination: కాలం వేగంగా పరిగెడుతోంది. ఇప్పటికే సమాజంలో చాలా మార్పు వచ్చింది. సైన్స్, సాంకేతికరంగాల్లో దేశం దూసుకుపోతోంది. అంతా కంప్యూటర్ యుగమైంది. ప్రాంతాలు, కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం.. ఇలా సమాజం ఎంతో మందుకు వెళ్తుంటూ.. ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు.. వివక్షలు తగ్గడం లేదు.

తాజాగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్న ఒక షాకింగ్‌ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యండపల్లి హైస్కూల్‌లో దళిత విద్యార్థులపై జాతి వివక్ష కొనసాగుతుందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తమ పిల్లలను అవహేళన చేస్తూ, కులం పేరుతో దూషిస్తున్నారని వారు ఆరోపించారు.

Advertisement

వివరాల ప్రకారం.. తరగతి గదుల్లోనే కొంతమంది ఉపాధ్యాయులు బహిరంగంగానే మీది వెధ‌వ జాతి, ఎస్సీలు ఏమైనా పుడింగులు అనుకున్నారా..? అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలను చెడ్డపేర్లతో పిలుస్తూ అవమానిస్తున్నారని హెచ్‌ఎం‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Also Read: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు

Advertisement

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, పాఠశాల ఎదుట పెద్ద సంఖ్యలో చేరి రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల నిర్వహణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో పిల్లలకు భద్రత, సమానత్వం ఉండాల్సిన సమయంలో ఉపాధ్యాయుల నుంచే అవమానాలు ఎదుర్కోవడం దారుణమని పలువురు అభిప్రాయపడ్డారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×