E-Paper
Advertisement

Dastagiri: దస్తగిరి సేఫేనా? భద్రతపై సీబీఐ ఆందోళన!?

Dastagiri: దస్తగిరి సేఫేనా? భద్రతపై సీబీఐ ఆందోళన!?
Advertisement
dastagiri avinash reddy

Dastagiri: వివేకా హత్య కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఎంపీ అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రేపోమాపో అరెస్ట్ అంటూ మళ్లీ ప్రచారం జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో.. సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లారు. అదే సమయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా పులివెందులలోని తన ఇంటికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు సీబీఐ, ఇటు అవినాష్.. పులివెందులలో హైటెన్షన్ కొనసాగుతోంది.

మరోవైపు, సీబీఐ సిబ్బంది పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లడం ఆసక్తికర పరిణామం. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి ఇస్తున్న భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు వెంటనే చెప్పాలని దస్తగిరికి సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సీబీఐ హెచ్చరించింది.

Advertisement

తనకు ప్రాణహాని ఉందంటూ, అదనపు భద్రత కల్పించాలంటూ ఇటీవల జిల్లా ఎస్పీని కోరాడు దస్తగిరి. వెంటనే స్పందించిన ఎస్సీ.. దస్తగిరికి సెక్యూరిటీని 1+5కి పెంచారు. అయినా, అవినాష్ అనుచరుల నుంచి తనకు ప్రమాదం పొంచిఉందని ఆరోపిస్తున్నారు దస్తగిరి. అటు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు దిశగా పరిణామాలు వేగంగా మారుతుండటంతో.. ఆయన అరెస్ట్ అయితే ఆ కోపంలో అతని అనుచరులు దస్తగిరిపై అటాక్ చేసే అవకాశం ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. తాజాగా, సీబీఐ అధికారులు సైతం దస్తగిరిని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×