E-Paper
Advertisement

AP CEC Tour: ఏపీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. నేడు సీఎస్, డీజీపీలతో భేటీ

AP CEC Tour: ఏపీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. నేడు సీఎస్, డీజీపీలతో భేటీ
Advertisement

AP CEC Tour: ఏపీలో తర్వలో ఎన్నికల నగరా మోగనుంది. దీంతో ఎలక్షన్ల నిర్వహణపై ఫోకస్‌ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ బృందం కీలక సమావేశాలతో బిజీ అయింది. ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలతోపాటు.. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించగా.. ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతోనూ.. ఆ తర్వాత సీఎస్‌, డీజీపీ, అధికారులతోనూ సమావేశం కానుంది.

ఇవాళ రెండో రోజు ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో మీనా ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఈ సమీక్షలో మద్యం, నగదు అక్రమ రవాణా అరికట్టడంపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌, డీజీపీ, అధికారులతోనూ కేంద్ర ఎన్నికల బృందం సమావేశం కానుంది.

Advertisement

మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీ నేతలతో ఈసీ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించింది. ఆ తర్వాత జిల్లాల అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, అనంతపురం ఆఫీసర్లపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గ స్థాయి అధికారులను కూడా నిలదీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే పని అయితే విధుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని అధికారులందరి గురించిన రిపోర్ట్‌ తమ దగ్గర ఉందన్న ఈసీ.. ఏ అధికారి ఎలాంటి వారో తెలియదని అనుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చింది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×