BigTV English

Chandrababu compares Jagan to pablo Escobar: జగన్‌ని ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు?

Chandrababu compares Jagan to pablo Escobar: జగన్‌ని ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు?

Chandrababu compares Jagan to pablo Escobar: ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధి నేత జగన్ ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? చంద్రబాబు సర్కార్‌ని చూసి భయం మొదలైందా? జగన్ ఎందుకు తత్తరబాటు పడుతున్నారు? చంద్రబాబు సర్కార్ పెట్టబోయే కేసుల గురించి తెలిసి ముందే స్కెచ్ వేసుకున్నారా? ఆ ప్లాన్ ప్రకారమే చంద్రబాబు సర్కార్‌పై జగన్ బురద జల్లుతున్నారా? జగన్‌ని కొలంబియా డ్రగ్ లార్డ్ ఎస్కోబార్‌‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు? అన్న ప్రశ్నలు ఏపీ అంతటా రైజ్ అవుతున్నాయి.


ఏపీ ఎన్నికల ప్రచారంలో జగన్‌ను ఉత్తర‌కొరియా నియంత కిమ్‌తో పోల్చారు. ఎన్నికల్లో ఈ విషయం మేజర్‌గా హైలెట్ అయ్యింది. ఇప్పుడు కొలంబియా డ్రగ్స్ అధినేత ఎస్కోబార్‌తో పోల్చారు సీఎం చంద్ర బాబు. గురువారం ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలోఉన్న 80మంది ఎమ్మెల్యేలపై వైసీపీ సర్కార్ కేసులు పెట్టిందన్నారు. జగన్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో వివరించారు సీఎం.

ఇదే సమయంలో ఒకప్పటి కొలండియా డ్రగ్స్ అధినేత ఎస్కోబార్ చేసిన నేరాలను వివరించారు. కేవలం డ్రగ్స్‌తో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఎదిగాడని గుర్తు చేశారు. అధికారులను తన చేతిలో పెట్టుకునేందుకు చేసిన దారుణాలను వివరించారు సీఎం చంద్రబాబునాయుడు. వీలైతే దానిపై తెరకెక్కించిన సినిమా చూడాలని సభ్యులు, ప్రజలకు సూచన చేశారు.


ALSO READ: నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు

అదానీ, అంబానీ, టాటాల కంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలనేది జగన్ కోరికగా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఏపీలో ప్రతి గ్రామాల్లోనూ గంజాయ్ అమ్మకాలు విచ్చల విడిగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఇది అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనిపై నియంత్రణ మొదలుపెట్టామన్నారు. ఈ క్రమంలో హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని పదేపదే చెబుతోంది కూటమి ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా చెలరేగిపోతున్న పేటీయం బ్యాచ్‌కి ప్రభుత్వం తరుపున వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మహిళల మీద అసభ్యకరంగా పోస్టింగులు వేస్తే ప్రభుత్వం తాట తీస్తుందని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నేరాలను అరికట్టేందుకు వీలైతే శాంతి భద్రతలపై మరో రోజు పొడిగించా లని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. దానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మొత్తానికి జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాకు సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తారని తాము ఊహించలేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట.

 

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×