E-Paper
Advertisement

Chandrababu : అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? ప్రభుత్వ టెర్రరిజం అంటూ చంద్రబాబు ఫైర్

Chandrababu : అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? ప్రభుత్వ టెర్రరిజం అంటూ చంద్రబాబు ఫైర్
Advertisement

Chandrababu : జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యన్నపై తప్పుడు ఫిర్యాదు చేయించారని.. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

అయ్యన్న పాత్రుడు అరెస్టు వైసీపీ అరాచక పాలనకు పరాకాష్టని.. విశాఖలో భూకబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. పోలీసులు తాగి వచ్చారని.. గోడ దూకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చెప్పులు కూడా వేసుకోనీయకుండా అయ్యన్నను లాక్కెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై షర్మిల ఇచ్చిన వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేయించారన్నారు చంద్రబాబు.

Advertisement

హత్య చేసిన అవినాష్‌కు అభయం ఇస్తున్నారు.. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారు.. వెనకబడిన వర్గాలపై కక్ష గట్టి పనిచేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. సీఐడీ ఆఫీస్‌ టార్చర్‌ ఆఫీస్‌గా మారిందని మండిపడ్డారు. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. .

అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? అయ్యన్న కుటుంబంపై 12 కేసులు పెడతారా? కోర్టులు చీవాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిరాలేదని చంద్రబాబు విమర్శించారు. ఇది ప్రభుత్వమే చేస్తున్న టెర్రరిజం అన్నారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×