E-Paper
Advertisement

IPS officers: ఏపీలో మరోసారి.. సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం..

IPS officers: ఏపీలో మరోసారి.. సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం..
Advertisement

IPS officers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్ ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది. 16 మంది ఐపీఎస్ అధికారులను ఒకేసారి బదిలీలు చేసింది. సీఐడీ చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా రామకృష్ణ నియమించింది.

నిఘా విభాగం ఎస్పీ అట్టాడ బాబూజీని అక్కడి నుంచి బదిలీ చేయలేదు. అలాగని పోస్టింగ్ ఇవ్వలేదు. పోలీసు ప్రధాన కార్యాలంలో రిపోర్టు చేయాలని మాత్రమే ఆదేశించింది. గత ఐదేళ్లు ఆయన నిఘా విభాగంలోనే ఉన్నారు.

Advertisement

ప్రొవిజెన్స్ అండ్ లాజస్టిక్స్ విభాగం ఐజీగా ఎం రవి ప్రకాష్‌ను నియమించింది. ఐపీఎస్ అధికారి దీపిక రిక్వెస్ట్ మేరకు ఆమెను కాకినాడ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఆమె భర్త విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎస్పీగా ఉన్నారు. చానాళ్లుగా వెయిటింగ్‌లో ఉన్న మేరీ ప్రశాంతిని విశాఖ డీసీపీగా నియమించింది.

కొన్ని నెలలుగా వెయిటింగ్‌లో ఉన్న అమ్మిరెడ్డి, విజయరావు, ఎస్పీలు సిద్ధార్థ కౌశల్, మేరీ ప్రశాంతి, రాధిక అరిఫ్ హఫీజ్, తిరుమలేశ్వర్ రెడ్డలకు వివిధ విభాగాల్లో పోస్టింగులు ఇచ్చింది. వీరిలో అమ్మిరెడ్డి, విజయరావు, తిరుమలేశ్వర్ రెడ్డి, అరిఫ్ హఫీజ్ లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు లేకపోలేదు.

Advertisement

ALSO READ: సరిపోతుందా శనివారం, తేడా వస్తే మక్కెలిరగ దీస్తా.. డిక్లరేషన్ మాటేంటి?

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×