E-Paper
Advertisement

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు.

టీడీపీ పాలనలో ఆక్వారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు నిండా మునిగిపోయారని ప్రభుత్వం‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. పంటలకు సాగునీరు ఇచ్చిన కాటన్‌ దొరను ఇప్పటికీ ఈ ప్రాంతపు రైతులు పూజిస్తారని చంద్రబాబు తెలిపారు.

ఆకలి తీర్చిన అన్నపూర్ణ.. డొక్కా సీతమ్మ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే అని గుర్తు చేశారు. ప్రభుత్వం కాలువలు బాగు చేయకుండా పంటలను నాశనం చేసిందని ఆరోపించారు. తాము ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే జిల్లాకు సాగునీరు అందేది అని అన్నారు. ఆక్వా రైతులకు సీఎం జగన్ అనేక హామీలను ఇచ్చారని పేర్కొన్నారు. వాటిని అమలు చేయకుండా ఆక్వా రైతులను‌ మోసం చేశారని చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×