BigTV English
Advertisement

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు.


టీడీపీ పాలనలో ఆక్వారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు నిండా మునిగిపోయారని ప్రభుత్వం‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. పంటలకు సాగునీరు ఇచ్చిన కాటన్‌ దొరను ఇప్పటికీ ఈ ప్రాంతపు రైతులు పూజిస్తారని చంద్రబాబు తెలిపారు.

ఆకలి తీర్చిన అన్నపూర్ణ.. డొక్కా సీతమ్మ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే అని గుర్తు చేశారు. ప్రభుత్వం కాలువలు బాగు చేయకుండా పంటలను నాశనం చేసిందని ఆరోపించారు. తాము ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే జిల్లాకు సాగునీరు అందేది అని అన్నారు. ఆక్వా రైతులకు సీఎం జగన్ అనేక హామీలను ఇచ్చారని పేర్కొన్నారు. వాటిని అమలు చేయకుండా ఆక్వా రైతులను‌ మోసం చేశారని చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు.


Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×