BigTV English
Advertisement

Chandrababu Naidu : లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తాం.. కుప్పం పర్యటనలో చంద్రబాబు..

Chandrababu Naidu : లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తాం.. కుప్పం పర్యటనలో చంద్రబాబు..
Chandrababu naidu kuppam meeting

Chandrababu naidu kuppam meeting(AP news today telugu) :


కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు రామకుప్పంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుప్పం ప్రజల ఉత్సాహం చూస్తుంటే లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. వాటి వల్లే రామకుప్పంలో 35 రకాల కూరగాయలు పండుతున్నాయని ఆయన వెల్లడించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు సాగు నీటి ఎద్దడి లేకుండా హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి మంత్రికి కాంట్రాక్టులపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులన్నీ వాళ్లే చేస్తూ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు. కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని అన్నారు చంద్రబాబు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×