BigTV English
Advertisement

Delhi : ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..

Delhi: భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌ అడ్మిరల్‌లకు సంబంధించి మొత్తం అయిదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ప్రతిబింబిచేలా ఇటీవల నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. . భుజానికి ధరించే విధంగా ఈ బ్యాడ్జీ ఆకృతిని నిర్మించారు. ఈ బ్యాడ్జీ అధికారి స్థాయిని చూపిస్తుంది.

Delhi : ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..

Delhi : భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌ అడ్మిరల్‌లకు సంబంధించి మొత్తం అయిదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఈ బ్యాడ్జీలు ప్రతిబింబిస్తాయని ఇటీవల నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. . భుజానికి ధరించే విధంగా ఈ బ్యాడ్జీ ఆకృతిని నిర్మించారు. ఈ బ్యాడ్జీ అధికారి స్థాయిని చూపిస్తుంది.


బ్యాడ్జీపై ఎరుపు రంగులో అష్టభుజి ఆకారంలోని చిహ్నం ఉంటుంది. ఎనిమిది దిక్కుల్లో నౌకాదళ దార్శనికతను సూచిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది, నౌకాదళ చిహ్నం నుంచి దీన్ని రూపొందించారు. అష్ట భుజాకారం మీద ‘నౌకాదళ చిహ్నం’తో కూడిన బంగారు బటన్‌ను ఏర్పాటు చేశారు. బానిసత్వ మనస్తత్వాన్ని వదిలించుకోవాలనే సంకల్పాన్ని ఇది సూచిస్తుంది. బ్యాడ్జ్ నిర్మాణంలో కింద ఖడ్గం, టెలిస్కోప్‌లు ఉన్నాయి. భారతదేశ శక్తిసామర్థ్యాలను, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ఈ ‘ఖడ్గం’ సూచిస్తుంది. దూరదృష్టిని ‘టెలిస్కోప్‌’ ప్రతిబింబిస్తుంది. సేవలు అందిస్తున్న అధికారులు ర్యాంకుల బట్టి నక్షత్రాల సంఖ్య, బ్యాడ్జీ అంచు రంగు ఉంటుంది.

భారత నౌకాదళానికి సరికొత్త చిహ్నాన్ని (నిశాన్‌) ప్రధాని మోదీ గతేడాది సెప్టెంబరులో ఆవిష్కరించారు. దీనికి ముందు ఉన్న గుర్తు దేశ వలసవాద గతాన్ని గుర్తు చేసేలా ఉందని కేంద్రం భావించింది. దీనికి అనుగుణంగానే మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా కొత్త చిహ్నాన్ని రూపొందించింది. సముద్ర జలాలు, తీరాలపై ఆధిపత్యం చెలాయించిన భారత రాజుల్లో శివాజీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన అత్యంత విశ్వసనీయమైన పటిష్టమైన నౌకాదళాన్ని నిర్మించారు. శివాజీ నిర్మించిన ఈ నౌకదళం లో దాదాపుగా 60 యుద్ధ నౌకలు సేవలు అందించేవి. సుమారుగా 5 వేల మంది సైన్యం ఉండేవారని గతంలో ఓ వీడియోని నేవి అధికారులు విడుదల చేశారు. ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్నప్పుడు తీర ప్రాంతంలో ఈ దళం కీలక సేవలు అందించింది.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×