BigTV English

Chandrababu : రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదు.. అన్ని సర్వేల్లో తేలింది ఇదే..

Chandrababu : గాడితప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Chandrababu : రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదు.. అన్ని సర్వేల్లో తేలింది ఇదే..

Chandrababu : గాడితప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని..ఇంత దారుణమైన సీఎంను, పాలనను మాత్రం ఎప్పుడూ చూడలేదని జగన్ పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసిందని.. అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు.

పాఠశాలల భవనాలకు రంగులు వేయడమే అభివృద్ధి కాదు, అందులో చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే.. అదే నిజమైన విద్యాభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ హాయంలో విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఆర్థిక సాయం చేసిన ఘనత తమకే దక్కిందన్నారు.


ఎమ్మెల్యేలను బదిలీ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారన్నారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే మీరు, మీ ఇంటెలిజెన్స్‌ ఏం చేసిందని బాబు ప్రశ్నించారు. ఎవరికి కావాల్సింది వారు దోచుకుతిన్నారన్నారు. ఇప్పుడేమో సర్వేల పేరుతో నాటకాలాడుతున్నారని బాబు విమర్శించారు. రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇసుక, మద్యం దందాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. ప్రజా వ్యతిరేకత రాగానే ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నారు.

జగన్‌.. రాజధాని మార్చలేరని, కనీసం విశాఖపట్నం కూడా వెళ్ల లేరని చంద్రబాబు ఆరోపించారు. ఏప్రిల్‌ తర్వాత టీడీపీ ప్రభుత్వమే వస్తుందని బాబు జోస్యం చెప్పారు. జగన్ మంచికి.. చెడుకీ తేడా తెలియని వ్యక్తి అన్నారు. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నించడం లేదన్నారు. 5 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్‌ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదన్నారు. జగన్ పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా గందరగోళంలోకి నెట్టారని జగన్ పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×