E-Paper
Advertisement

Chandrababu : వడ్డీతో సహా చెల్లిస్తాం..గన్నవరంలో చంద్రబాబు గరంగరం..

Chandrababu : వడ్డీతో సహా చెల్లిస్తాం..గన్నవరంలో చంద్రబాబు గరంగరం..
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరంలో పర్యటించారు. టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దొంతు చిన్నా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతరం ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు.

పక్కా ప్లాన్ తో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ సైకోలే ఈ దాడి చేశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసు అధికారుల తీరును తప్పుపట్టారు. వాళ్ల వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. గన్నవరం పాకిస్థాన్ లో ఉందా అని ప్రశ్నించారు. తనను పర్యటించొద్దని ఎలా చెబుతారని నిలదీశారు.

Advertisement

బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అరాచకాలపై పోరాడుతూనే ఉంటామన్నారు. రెచ్చగొట్టి తప్పుడు పనులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక జైలుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు గతంలో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే మార్గంలో వెళ్లవద్దని సూచించారు. ఎన్నివేల మంది వస్తారో రావాలి సవాల్ చేశారు. తాడోపేడో తెల్చుకుందామని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.

ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా ఉద్యమానికి ప్రజలే ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×