BigTV English
Advertisement

CBI : మళ్లీ సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి.. వాట్ నెక్ట్స్..?

CBI : మళ్లీ సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి.. వాట్ నెక్ట్స్..?

CBI :వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరోసారి విచారణ రావాలని నోటీసులు అందడంతో ఆయన.. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు.


వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి పాత్రే కీలకమని సీబీఐ అనుమానిస్తోంది. అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి ప్రమేయం కూడా ఉందని భావిస్తోంది. వివేకా హత్య కేసులో అవినాస్ రెడ్డిని తొలిసారి జనవరి 28న సీబీఐ ప్రశ్నించింది. ఆ సమయంలో హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో సీబీఐ అధికారులు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా తొలి విడత సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు తర్వాత రెండు ఫోన్ నంబర్లు అవినాష్ వాడినట్లు గుర్తించారు. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌ నంబర్లకు కాల్‌ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తర్వాత కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్ ను కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది.


వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. 23న హాజరుకాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. అవినాశ్‌ రెడ్డి మాత్రం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూ వివేకా హత్య కేసు బిగుస్తోంది. తాజాగా కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ తండ్రికొడుకుల ప్రమేయం ఆధారాలను పొందుపర్చింది. ఈ కోణంలో దర్యాప్తు చేస్తోంది. హత్యకు 40 కోట్లకు డీల్ జరిగిందని అభియోగాలు మోపింది. ఆ దిశగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. మరి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా?

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×