E-Paper
Advertisement

Chandragiri Dsp action by DGP: చంద్రగిరి డీఎస్పీపై వేటు, పెట్రోల్ బాంబులు కలకలం

Chandragiri Dsp action by DGP: చంద్రగిరి డీఎస్పీపై వేటు, పెట్రోల్ బాంబులు కలకలం
Advertisement

Chandragiri Dsp action by DGP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే కాదు, తర్వాత కూడా పోలీసుల పై వేటు కంటిన్యూ అవుతోంది. ఎన్నికల్లో ఖాకీల వ్యవహార శైలిపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇంటాబయటా బయట విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

తాజాగా చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి ఆయనను సరెండర్ చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగిన ఘటనలను నిలువరించడంతో విఫలమైనందుకు వేటు వేసినట్టు తెలుస్తోంది. అధికార-విపక్షాల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా వాటికి కంట్రోల్ చేయకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

Advertisement

ఎన్నికలకు మూడు నెలల కిందట యశ్వంత్‌ను చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. అయినా యశ్వంత్ పట్టించుకోలేదు. ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసు అధికారి విఫలమయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తర్వాతైనా టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి భద్రత కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఇంకెంతమంది అధికారులపై వేటు పడుతుందో చూడాలి.

ALSO READ: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు

Advertisement

ఇదిలావుండగా ఎన్నికల ఫలితాల వేళ పల్నాడు హింస జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సోదాలు తీవ్రతరం చేశారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గడ్డివాములో దాచి ఉంచిన నాలుగు పెట్రోల్ బంబులను స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. దీంతో పోలీసులు అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలపై ఓ నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని ఆ జిల్లా ఎస్పీ, దిగువస్థాయి అధికారులకు సీరియస్‌గా చెప్పినట్టు సమాచారం.

 

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×