E-Paper
Advertisement

MLC Ashok Babu: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు

MLC Ashok Babu: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు
Advertisement

TDP MLC Ashok Babu Fire On YCP Complaints: పోస్టల్ బ్యాలెట్‌‌లో 90 శాతం ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అందుకే ఆ ఓట్లను తగ్గించుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను టీడీపీ ఏం కోరిందో తెలుసుకోకుండా వైసీపీ ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు అని అన్నారు.

టీడీపీ 750 ఫిర్యాదులను చేస్తే వాటిలో కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై  ఎన్నికల సంఘానికి తాము చేసిన ఫిర్యాదును వైసీపీ నేతలు తప్పుగా చిత్రీకరిస్తున్నరని ధ్వజమెత్తారు.

Advertisement

పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి తక్కువ ఓట్లు రావడంతోనే కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. తాము ఓడి పోతున్నామన్న సంగతి పైసీపీ నేతలకు ముందే తెలిసిపోయిందన్నారు. అందుకే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నేతలపై 400కు పైగా కేసులు ఉన్నాయని ఆరోపించారు. కోర్టులంటే వారికి లెక్క లేదని అన్నారు. అనేక అంశాల్లో సుప్రీంకోర్టు సైతం వైసీపీకి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్‌కు మందు జూన్ 4న వస్తుందని తెలిపారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×