E-Paper
Advertisement

Chennai: తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai:  తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థు లు స్పాట్ లో మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా ఏపీకి చెందినవారు.

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెలవు రావడంతో కారులో తమిళనాడు వెళ్లారు. శనివారం కారులో వీరంతా తిరువణ్ణామలై వెళ్లి అరుణాచలం స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరిగి ఆదివారం రాత్రి కాలేజీకి బయలుదేశారు.

తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి కారు రాగానే వేగంగా వచ్చిన కంటెయినర్ ట్రక్కు వీరిని ఢీ కొట్టింది. లారీ వేగానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఐదుగురు స్టూడెంట్స్ స్పాట్‌లో మృతి చెందా రు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ALSO READ: అలర్ట్.. తిరుమలలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు

మృతులంతా ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారు. ప్రొద్దుటూరుకి చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేశ్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను సతీష్‌లు ఉన్నారు. వీరంతా చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.

విష్ణు, చైతన్యలకు గాయాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ తిరువళ్లూరులోని ప్రభుత్వం ఆసుపత్రిలో కోలు కుంటున్నారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×