E-Paper
Advertisement

Chennai: తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai:  తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..
Advertisement

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థు లు స్పాట్ లో మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా ఏపీకి చెందినవారు.

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెలవు రావడంతో కారులో తమిళనాడు వెళ్లారు. శనివారం కారులో వీరంతా తిరువణ్ణామలై వెళ్లి అరుణాచలం స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరిగి ఆదివారం రాత్రి కాలేజీకి బయలుదేశారు.

Advertisement

తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి కారు రాగానే వేగంగా వచ్చిన కంటెయినర్ ట్రక్కు వీరిని ఢీ కొట్టింది. లారీ వేగానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఐదుగురు స్టూడెంట్స్ స్పాట్‌లో మృతి చెందా రు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ALSO READ: అలర్ట్.. తిరుమలలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు

Advertisement

మృతులంతా ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారు. ప్రొద్దుటూరుకి చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేశ్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను సతీష్‌లు ఉన్నారు. వీరంతా చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.

విష్ణు, చైతన్యలకు గాయాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ తిరువళ్లూరులోని ప్రభుత్వం ఆసుపత్రిలో కోలు కుంటున్నారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×