E-Paper
Advertisement

Road accident: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ సస్పెండ్..

Road accident: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ సస్పెండ్..

చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ రహ్మతుల్లాను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో ఎస్‌ఐ రహ్మతుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

గతంలో వెంకటనాయుడు వద్ద నుంచి మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు రెండు కార్లను రహ్మతుల్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రమాదం జరిగిన రోజున వెంకటనాయుడు గ్యాంగ్ సభ్యులతో ఎస్‌ఐ రహ్మతుల్లా ఫోన్‌లో పలుమార్లు మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. మరింత అనుమానాస్పద అంశంగా, ఈ ప్రమాదం తన అధికార పరిధిలోకి రాకపోయినా రహ్మతుల్లా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటనాయుడు తండ్రి అయిన ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ను కూడా అధికారులు బదిలీ చేశారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×