BigTV English
Advertisement

ministers RK Roja : మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

ministers RK Roja : మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

CID case filed on AP ex ministers RK Roja..Dharmana Krishnadas: మాజీ మంత్రి రోజా.. ఒకప్పటి వెండితెర అందాల రాణి. సినిమాలు, రియాలిటీ షోల తో పాపులర్ అయిన రోజా రాజకీయ రంగంలోనూ ఒక వెలుగు వెలిగారు. మొదట తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రోజా.. తర్వాత వైఎస్ జగన్ పార్టీ మారారు. తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలోనూ చిక్కులు కోరి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు కూడా ఆయనపై కౌంటర్ ఎటాక్ చేసి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ను సైతం టార్గెట్ చేసి మాట్లాడారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి చవిచూశారు.


ఆడుదాం..అక్రమాలు

రోజా మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్రా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇందు కోసం ఏకంగా రూ.150 కోట్ల మేరకు ఖర్చుపెట్టారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిగా ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా, ధర్మానపై టీడీపీ నేతలు అనుమానాు వ్యక్తంచేశారు.
ఆడుదాం ఆంధ్రా అంటూ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని.. అసలైన టాలెంట్ ఉన్న క్రీడాకారులను పక్కన పెట్టి తమ ఇష్టారీతిన ఎంపిక చేసి ఏకపక్షంగా వ్యవహరించారు. పైగా నిధులన్నీ స్వాహా చేశారు. ప్రత్యేకంగా అధికార పక్షం వాళ్లే నియమ నిబంధనలు అమలు చేశారు. పైగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ఎన్నికలలో ప్రచారాస్త్రంగా సైతం ఉపయోగించుకున్నారు.


అరెస్ట్ తప్పదా?

ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు ఆడుదాం ఆంధ్రా పేరుతో 150 కోట్ల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. వీగి అక్రమాలపై విచారణ జరిపించేందుకు సీఐడీ సిద్ధమయింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఐడీ శాఖ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏ క్షణమైనా రోజా అరెస్ట్ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×