E-Paper
Advertisement

YCP : మంత్రి Vs ఎంపీ .. వైసీపీలో ఆధిపత్య పోరు..

YCP : మంత్రి Vs ఎంపీ .. వైసీపీలో ఆధిపత్య పోరు..
Advertisement

YSRCP latest news(Andhra Pradesh political news today): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీలో ముసలం మొదలైంది. ఆ పార్టీలో అధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. మంత్రి వేణుపై బోస్‌ వర్గం తిరుగుబాటుకు దిగడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.

ఆదివారం వెంకటాయపాలెంలో పిల్లి బోస్‌ వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. బోస్‌పై అభిమానంతోనే వేణును గత ఎన్నికల్లో గెలిపించామని ఎంపీ వర్గీయులు స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి తమపైనే రౌడీషీట్ తెరిపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొడుకు రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆరోపించారు. వైసీపీని మంత్రి వేణు నాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Advertisement

శెట్టిబలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ అణగదొక్కుతున్నారని బోస్ వర్గం నేతలు ఆరోపించారు. ఈసారి రామచంద్రపురం టికెట్ వేణుకి ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి బోస్ కుటుంబానికే రామచంద్రపురం టికెట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ టికెట్ బోస్ కుటుంబానికి ఇవ్వకపోతే.. ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ ను పోటీకి దించి గెలిపిస్తామని తేల్చిచెప్పారు.

రూ.12 కోట్లు ఖర్చు పెట్టామని, డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని పిల్లి బోస్ వర్గీయులు ఆరోపించారు. ఈ నెల 26న అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితులు వివరిస్తామని బోస్ అనుచరులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్‌కు వైసీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×