E-Paper
Advertisement

Janasena : పవన్ కల్యాణ్ తో పంచకర్ల భేటీ.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు..

Janasena : పవన్ కల్యాణ్ తో పంచకర్ల భేటీ.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు..
Advertisement

Janasena latest updates(political news in AP): మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ తోపాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నెల 20న జనసేనలో చేరతానని పంచకర్ల ప్రకటించారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పంచకర్ల చేరికతో విశాఖలో జనసేన బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇటీవల వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఆ సమయంలో వైసీపీలో పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనకు స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విషయాలు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా అవకాశం రాలేదని తెలిపారు. అందుకే వైసీపీని వీడుతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

Advertisement

వచ్చే ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి ఎలమంచిలిలో గెలిచారు. అదే స్థానం నుంచి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2 ఏళ్లు గడవక ముందే వైసీపీని వీడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పెందుర్తి బరిలోకి దిగాలని పంచకర్ల ప్రయత్నిస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×