E-Paper
Advertisement

CM Chandrababu: దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. ఆ ఘనత కేంద్రానిదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. ఆ ఘనత కేంద్రానిదే: సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమని సీఎం అన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఒక్క అమరావతికి మాత్రమే దక్కుతుందన్నారు.

ఒకే చోట 15 బ్యాంకులు

అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభం చేశారన్నారు. 2028 మార్చి నాటికి అమరావతి పనులు వేగంగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవ్వడానికి ముఖ్య కారణం నిర్మలా సీతారామన్‌ అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల నిధులిచ్చారన్నారు.

సాంకేతిక హబ్ గా అమరావతి

Advertisement

ఇవాళ రూ.1,334 కోట్లతో వివిధ బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకేచోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశం అన్నారు. దీంతో 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందన్నారు. అమరావతిని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకోవడం ఖాయమని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుందని సీఎం అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

Also Read: Nirmala Sitharaman: అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన

అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం

Advertisement

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న కాస్మోస్ ప్లానెటోరియంకు సంబంధించి ఏపీ సీఆర్డీఏ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×