E-Paper
Advertisement

CM Chandrababu Emotional: సీఎం చంద్రబాబు ఎమోషనల్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే, చావు గురించి ఆలోచించి

CM Chandrababu Emotional: సీఎం చంద్రబాబు ఎమోషనల్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే, చావు గురించి ఆలోచించి
Advertisement

CM Chandrababu Emotional: ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గెస్ట్‌గా హాజరయ్యారు.  ఈ టాక్ షో గడిచిన ఐదేళ్ల రాజకీయ జీవితాల గురించి కీలక విషయాలు వెల్లడించారు సీఎం చంద్రబాబు.

53 రోజుల జైలు జీవితంలో అనుభవించిన కష్టాలు ఒకెత్తయితే, జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన మానసిక సంఘర్షణ, వేదన గురించి కళ్లకు కట్టినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆ సందర్భం చూసినప్పుడు గుండె తరక్కుపోయిందన్నారు. సందేహంగా ఉండే కొన్ని ఘటనలు జరగడం,  తానే డీమోరల్ అయితే ఏమీ ఉండదని భావించినట్టు వెల్లడించారు.

Advertisement

ఆనాటి ఘటన నుంచి ధైర్యంగా ఎదుక్కోవడం వల్లే బయటపడ్డానని మనసులోని మాట బయపెట్టారు సీఎం చంద్రబాబు. చనిపోతే ఒక్క క్షణం అనుకున్నాను.. ఆశ్రయం కోసం పని చేస్తే అది శాశ్వతమని భావించి ముందుకు అడుగు వేశానన్నారు. అదే తనను నడిపించదన్నారు.

నంద్యాలలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి అమరావతికి వచ్చిన వరకు పడిన కష్టాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. తానెప్పుడూ లక్షణ రేఖ దాటలేదన్నారు. తప్పు చేసినవాడ్ని వదిలిపెట్టను.. తప్పు చేయకుంటే వారి జోలికి వెళ్లనని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల బీభత్సం, సెల్ఫీ కోసం వెళ్తే ప్రాణాలు తీసిన గజరాజు, భయం గుప్పిట్లో అటవీ గ్రామాలు

తాను జైలులో ఉంటే కుటుంబమంతా రాజమండ్రిలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. తన ధైర్యంతోపాటు ఫ్యామిలీ నుంచి బలమై సపోర్ట్ ఉండడంతో గట్టెక్కానన్నారు. ములాఖత్‌లో కూడా ఇబ్బందులు పెట్టారన్నారు హోస్ట్ బాలకృష్ణ. లోకేష్‌ను ఇబ్బందిపెడితే, ఢిల్లీకి వెళ్లి ఫైట్ చేశారని గుర్తు చేశారు ఏపీ ముఖ్యమంత్రి.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×