CM Chandrababu: సీఎం చంద్రబాబు పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట నిచ్చారు. ప్రతి జిల్లాలో తక్షణమే 200 కొత్త పింఛన్లను మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల సమావేశం తెలిపారు. పింఛన్ల జారీపై కలెక్టర్లకు తగిన అధికారాలు లేకపోవడంతో సీఎం చంద్రబాబు దృష్ఠికి తీలుకెళ్లారు. ప్రజా వేదికలో అత్యవసర కేసుల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోందని కలెక్టర్లు సీఎంకు తెలిపారు.
దీనిపై తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్ల కేటాయింపులని నిర్ణయం తీసుకున్నారు. కొత్త పింఛన్లను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ యాంగులు, సర్వం కోల్పోయి ఆపదలో ఉన్నవారికి ఇవ్వాలని సూచించారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, కలెక్టర్ సమన్వయంతో ఈ పింఛన్లపై నిర్ణయం తీసుకోవాలని విచక్షణాధికారం కల్పించారు. పింఛన్ల పంపిణీలో ఎక్కడా రాజకీయం లేకుండా, అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు.
పింఛన్ల మంజూరులో కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించాలని సీఎం చంద్రబాబును కోరారు. అయితే దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి, కలెక్టర్లకు 200 పింఛన్లు మంజూరు చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందన్నారు. ఇక జిల్లాలో నీటి సంరక్షణ, గ్లోబల్ లాజిస్టిక్ టెక్నాలజీ, జీరో పావర్టీ, హ్యూమన్ రీసెర్స్ వంటి అంశాల్లో పనితీరు బాగుందన్నారు. మారిన జీవన విధానం, ఆలస్యంగా పెళ్లిళ్లు వల్ల సంతానోన్పత్తి తగ్గుతోందన్నారు.
అంత్యత ఖరీదైన ఫెర్టిలిటీ సేవలను ఎన్టీఆర్ వైద్యసేవలో చేరిస్తే బాగుంటుందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జీవన విధానంపై యువతను ఎడ్యుకేట్ చేయడం, అదే సమయంలో చికిత్స అవసరం అన్నారు. హెల్త్ప్లానింగ్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పిన చంద్రబాబు.. తర్వలో ఫ్రీ హెల్త్ కార్డులు మంజరు చేయనున్నారు.
Also Read : Hydra: 13 ఎకరాలు రూ.1300 కోట్లు.. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా