E-Paper
Advertisement

CM Chandrababu: పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్లు

CM Chandrababu: పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్లు
Advertisement

CM Chandrababu: సీఎం చంద్రబాబు పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట నిచ్చారు. ప్రతి జిల్లాలో తక్షణమే 200 కొత్త పింఛన్లను మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల సమావేశం తెలిపారు. పింఛన్ల జారీపై కలెక్టర్లకు తగిన అధికారాలు లేకపోవడంతో సీఎం చంద్రబాబు దృష్ఠికి తీలుకెళ్లారు. ప్రజా వేదికలో అత్యవసర కేసుల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోందని కలెక్టర్లు సీఎంకు తెలిపారు.

200 కొత్త పెన్షన్లు

దీనిపై తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్ల కేటాయింపులని నిర్ణయం తీసుకున్నారు. కొత్త పింఛన్లను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ యాంగులు, సర్వం కోల్పోయి ఆపదలో ఉన్నవారికి ఇవ్వాలని సూచించారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, కలెక్టర్ సమన్వయంతో ఈ పింఛన్లపై నిర్ణయం తీసుకోవాలని విచక్షణాధికారం కల్పించారు. పింఛన్ల పంపిణీలో ఎక్కడా రాజకీయం లేకుండా, అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు.

ఆలస్యంగా వెలుగులోకి

Advertisement

పింఛన్ల మంజూరులో కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించాలని సీఎం చంద్రబాబును కోరారు. అయితే దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి, కలెక్టర్లకు 200 పింఛన్లు మంజూరు చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందన్నారు. ఇక జిల్లాలో నీటి సంరక్షణ, గ్లోబల్‌ లాజిస్టిక్‌ టెక్నాలజీ, జీరో పావర్టీ, హ్యూమన్‌ రీసెర్స్‌ వంటి అంశాల్లో పనితీరు బాగుందన్నారు. మారిన జీవన విధానం, ఆలస్యంగా పెళ్లిళ్లు వల్ల సంతానోన్పత్తి తగ్గుతోందన్నారు.

అంత్యత ఖరీదైన ఫెర్టిలిటీ సేవలను ఎన్టీఆర్‌ వైద్యసేవలో చేరిస్తే బాగుంటుందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జీవన విధానంపై యువతను ఎడ్యుకేట్‌ చేయడం, అదే సమయంలో చికిత్స అవసరం అన్నారు. హెల్త్‌ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పిన చంద్రబాబు.. తర్వలో ఫ్రీ హెల్త్ కార్డులు మంజరు చేయనున్నారు.

Advertisement

Also Read : Hydra: 13 ఎకరాలు రూ.1300 కోట్లు.. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×