E-Paper
Advertisement

Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 
Advertisement

Chandrababu Naidu: ఏపీలో 2026 సంవత్సరాన్ని “టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్” ఏడుగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాలనలో సాంకేతికతను జోడించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (AI) పాత్రను పెంచాలని, ఏఐని ఉపయోగించుకుని ప్రజల ఫిర్యాదులను  వేగంగా పరిష్కరించాలని ఆయన నిర్దేశించారు. సీఎం చంద్రబాబు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పాలనలో సమర్థత పెంచడానికి ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చి, వారిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇకపై “డేటా డ్రివెన్ గవర్నెన్స్‌”  పై మరింత దృష్టి సారిస్తుందని, సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా ‘మిత్ర – వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా ప్రస్తుతం 878 రకాల సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన సమీక్ష జరిపారు. ప్రతి శాఖలోనూ పారదర్శకతను పెంచడానికి సాంకేతికతను ఒక ఆయుధంగా మలచుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, అవినీతికి తావులేకుండా ప్రజలకు అందాలంటే టెక్నాలజీ వినియోగం ఒక్కటే మార్గమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026ను “టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్” ఏడుగా ప్రకటించి, పాలనలో ఏఐ (AI) వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రజల ఫిర్యాదులను ఏఐ ద్వారా వేగంగా వర్గీకరించి పరిష్కరించడం, డేటా సెక్యూరిటీని కాపాడుతూ అజ్ఞాత డేటాను మాత్రమే విశ్లేషణకు వాడటం ప్రధాన లక్ష్యాలు.

Advertisement

నిర్ణయాల్లో పారదర్శకత కోసం ‘ఎక్స్‌ప్లైలబుల్ ఏఐ’ని వాడాలని, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించేందుకు పునరావృత పనులను ఆటోమేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ప్రిడిక్టివ్ గవర్నెన్స్ ద్వారా సమస్యలను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టేలా ఏఐ అల్గారిథమ్స్‌ను రూపొందిస్తున్నారు.

Read Also: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×