E-Paper
Advertisement

CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో సీఎం బాబు

CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో  సీఎం బాబు
Advertisement

CM chandrababu: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నింపిన శక్తి అందిలోనూ ఉంటుందని తెలిపారు.

సరిగ్గా వందేళ్ల క్రితం ఈ పుణ్యభూమిపై ఒక గొప్ప లక్ష్యం కోసం సత్యసాయిబాబా అవతరించారని కొనియాడారు. చిన్నతనం నుంచే ఎంతో కోట్ల మందిని ప్రభావితం చేశారని తెలిపారు. మానవ రూపంలో మనం చూసిన దైవస్వరూపమే సత్యసాయి బాబా అని చెప్పారు. విశ్వశాంతి, విశ్వ, సౌభాగ్యం, సకలజనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisement

అందుకే భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైందని సీఎం అన్నారు. ప్రమేతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి బాబా చాటిచెప్పారని తెలిపారు. సత్యసాయి పుట్టిన ఏపీలో తానూ పుట్టడం పూర్వజన్మ సుకృతమని చంద్రబాబు అభివర్ణించారు. సత్యసాయి విద్య, వైద్య, ప్రజావరసరాలని తీరుస్తూ.. సేవాభావమే దైవత్వమని నిరూపించారని అన్నారు. సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాదిమంది భక్తులు పయనిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారు: సీఎం రేవంత్

Advertisement

ఇదిలా ఉంటే.. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్‌లో ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు మంత్రి నారా లోకేష్.. ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×