E-Paper
Advertisement

CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో సీఎం బాబు

CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో  సీఎం బాబు
Advertisement

CM chandrababu: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నింపిన శక్తి అందిలోనూ ఉంటుందని తెలిపారు.

సరిగ్గా వందేళ్ల క్రితం ఈ పుణ్యభూమిపై ఒక గొప్ప లక్ష్యం కోసం సత్యసాయిబాబా అవతరించారని కొనియాడారు. చిన్నతనం నుంచే ఎంతో కోట్ల మందిని ప్రభావితం చేశారని తెలిపారు. మానవ రూపంలో మనం చూసిన దైవస్వరూపమే సత్యసాయి బాబా అని చెప్పారు. విశ్వశాంతి, విశ్వ, సౌభాగ్యం, సకలజనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisement

అందుకే భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైందని సీఎం అన్నారు. ప్రమేతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి బాబా చాటిచెప్పారని తెలిపారు. సత్యసాయి పుట్టిన ఏపీలో తానూ పుట్టడం పూర్వజన్మ సుకృతమని చంద్రబాబు అభివర్ణించారు. సత్యసాయి విద్య, వైద్య, ప్రజావరసరాలని తీరుస్తూ.. సేవాభావమే దైవత్వమని నిరూపించారని అన్నారు. సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాదిమంది భక్తులు పయనిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారు: సీఎం రేవంత్

Advertisement

ఇదిలా ఉంటే.. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్‌లో ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు మంత్రి నారా లోకేష్.. ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×