E-Paper
Advertisement

CM Revanth Reddy: సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారు: సీఎం రేవంత్

CM Revanth Reddy: సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారు: సీఎం రేవంత్

CM Revanth Reddy: ఏపీలోని పుట్టపర్తి సాయిబాబా శతజయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశం అన్నారు. బాబా ప్రేమతో మనుషులను గెలిచారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని సీఎం తెలిపారు.

ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి బాబా ట్రస్టు నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి చదువు అందించాలని సత్యసాయిబాబా బలంగా విశ్వసించారన్నారు. ఎల్ కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచిత విద్యను అందించారని తెలిపారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందించేలా చేశారన్నారు. పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

Also Read: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే కాకుండా తమిళనాడులో కూడా త్రాగునీటి సమస్యను పరిష్కరించిన గొప్ప సమాజ సేవకులు సత్యసాయి బాబా అని కొనియాడారు. తన ప్రేమ సందేశం ద్వారా మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానాన్ని పదిలం చేసుకున్నారని సీఎం తెలిపారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని సత్యసాయి బాబా అందించారని వెల్లడించారు. 140 దేశాల్లో సత్య సాయిబాబాకు భక్తులు ఉన్నారని వివరించారు. ఆయన మన మధ్యలో లేకపోయినా.. వారి ఆలోచన, స్ఫూర్తి, శతజయంతి ఉత్సవాల్లో కనిపిస్తోందని అన్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×