E-Paper
Advertisement

Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు

Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు

Puttaparthi: భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ సత్యసాయి బాబా అని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రేమ, సేవ, ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావంతో ఆయన జీవించారన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఇవాళ ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు.

ప్రేమ-సేవ- ప్రశాంతతకు ప్రతిరూపం సత్యసాయి బాబా

సర్వ మానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమన్నారు ముఖ్యమంత్రి. బుధవారం పుట్టపర్తిలో ప్రశాంతి సత్యసాయి నిలయంలో ఆయన శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, మానవసేవే మాధవసేవ అని నమ్మారని, దాన్ని బోధించారు.. ఆచరించారు.. చివరకు ఫలితం చూపించారన్నారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉందని, నాస్తికులను సైతం ఆధ్యాత్మికం వైపు నడిపించాని వివరించారు. వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో ప్రజలను ప్రభావితం చేశారన్నారు.

పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు

కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారన్నారు. బాబా చూస్తూ భజనలు చేస్తూ సామాన్యుల భక్తుల నుంచి దేశాధి నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలు గా ఇచ్చారన్నారు. ఆస్తులను వదిలి సత్యసాయి సన్నిధిలో ఎంతో మంది సంతోషంగా గడిపారన్నారు.

భక్తులను ప్రేమగా బంగారు అని సత్యసాయి పిలిచేవారని గుర్తు చేశారు. తాగు నీటి విషయంలో ఆయన చేసిన సేవ మరువలేదన్నారు. విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందించారన్నారు. 102 విద్యాలయాలు 60 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలియజేశారు. రెండు సూపర్ స్పెషాలిటీ, రెండు జనరల్ ఆసుపత్రులను, రెండు మొబైల్ ఆసుపత్రులు ప్రతీ రోజూ 3 వేల మంది సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా వైద్యం అందుతుందన్నారు.

ALSO READ: పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలు తనకు స్ఫూర్తి- మంత్రి లోకేష్

ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని అన్నారు. రాయలసీమకు తాగు నీరు, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారని చెప్పారు. 1972లో ఏర్పాటు అయిన సత్యసాయి ట్రస్ట్‌.. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవలందిస్తోందన్నారు. ఏ ట్రస్ట్‌కు లేని విధంగా 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.

 

https://twitter.com/bigtvtelugu/status/1991043968667431035

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×