E-Paper
Advertisement

Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు

Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు
Advertisement

Puttaparthi: భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ సత్యసాయి బాబా అని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రేమ, సేవ, ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావంతో ఆయన జీవించారన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఇవాళ ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు.

ప్రేమ-సేవ- ప్రశాంతతకు ప్రతిరూపం సత్యసాయి బాబా

Advertisement

సర్వ మానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమన్నారు ముఖ్యమంత్రి. బుధవారం పుట్టపర్తిలో ప్రశాంతి సత్యసాయి నిలయంలో ఆయన శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, మానవసేవే మాధవసేవ అని నమ్మారని, దాన్ని బోధించారు.. ఆచరించారు.. చివరకు ఫలితం చూపించారన్నారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉందని, నాస్తికులను సైతం ఆధ్యాత్మికం వైపు నడిపించాని వివరించారు. వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో ప్రజలను ప్రభావితం చేశారన్నారు.

Advertisement

పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు

కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారన్నారు. బాబా చూస్తూ భజనలు చేస్తూ సామాన్యుల భక్తుల నుంచి దేశాధి నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలు గా ఇచ్చారన్నారు. ఆస్తులను వదిలి సత్యసాయి సన్నిధిలో ఎంతో మంది సంతోషంగా గడిపారన్నారు.

భక్తులను ప్రేమగా బంగారు అని సత్యసాయి పిలిచేవారని గుర్తు చేశారు. తాగు నీటి విషయంలో ఆయన చేసిన సేవ మరువలేదన్నారు. విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందించారన్నారు. 102 విద్యాలయాలు 60 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలియజేశారు. రెండు సూపర్ స్పెషాలిటీ, రెండు జనరల్ ఆసుపత్రులను, రెండు మొబైల్ ఆసుపత్రులు ప్రతీ రోజూ 3 వేల మంది సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా వైద్యం అందుతుందన్నారు.

ALSO READ: పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలు తనకు స్ఫూర్తి- మంత్రి లోకేష్

ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని అన్నారు. రాయలసీమకు తాగు నీరు, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారని చెప్పారు. 1972లో ఏర్పాటు అయిన సత్యసాయి ట్రస్ట్‌.. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవలందిస్తోందన్నారు. ఏ ట్రస్ట్‌కు లేని విధంగా 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.

 

https://twitter.com/bigtvtelugu/status/1991043968667431035

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×