BigTV English
Advertisement

CM Chandrababu Naidu: వైసీపీ డ్రామాలు.. ఇదే పునరావృతం-సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: వైసీపీ డ్రామాలు..  ఇదే పునరావృతం-సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: జమిలి ఎన్నికలకు ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు సీఎం చంద్రబాబు. జమిలిపై అవగాహన లేని వైసీపీ, పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోంద న్నారు. వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని మనసులోని మాట బయటపెట్టారు.


రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్-2047 అని చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు.. 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.

మరోవైపు సభ్యత్వం నమోదులో టీడీపీ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. సభ్యత్వ నమోదుపై టీడీపీ ఆఫీసులో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల సంఖ్య ప్రస్తుతం 73 లక్షలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక సభ్యత్వ నమోదులో టాప్ -5లో రాజంపేట్, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.


ఎప్పుడూ లేని విధంగా ఈసారి యువత, మహిళలు సభ్యత్వాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పార్టీలో ఉన్నామంటే కుదరదని, పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయనివారికి పదవులు కావాలని కోరడం సరికాదన్నారు. పదవులు వచ్చాయని కొందరు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పుకనే చెప్పేశారు సీఎం చంద్రబాబు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×