E-Paper
Advertisement

TDP says CM Jagan chapter closed: జగన్ చాప్టర్ క్లోజ్, వాళ్లది మైండ్ గేమ్ అంటూ..

TDP says CM Jagan chapter closed: జగన్ చాప్టర్ క్లోజ్, వాళ్లది మైండ్ గేమ్ అంటూ..
Advertisement

TDP leaders comments on CM Jagan(Andhra politics news):

ఎన్నికల ఫలితాలపై వైసీసీ మైండ్ గేమ్ ఆడుతుందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. ఫ్యాన్ పార్టీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ చేస్తుంటే నవ్వు వస్తుందన్నారు రఘురామకృష్ణరాజు, గంటా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయా నేతలు.. ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేయిస్తోందన్నారు.

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారమంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. వైవీ సుబ్బారెడ్డి, బొత్స ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ప్రమాణ స్వీకారానికి స్టేడియం ఏర్పాట్లు, స్టార్ హోటల్స్ బుక్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందని, నాలుగుతో దుకాణం క్లోజ్ అవుతుందన్నారు గంటా శ్రీనివాసరావు.

Advertisement

ఐప్యాక్ టీమ్ వచ్చి సీఎం జగన్‌కు ఎన్ని సీట్లు వస్తాయని చెబుతారని, అలాంటిది ఆయన అక్కడికి వెళ్లి అన్ని సీట్లు చెప్పడం మరీ దారుణంగా ఉందన్నారు సోమిరెడ్డి. మాచర్ల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఓటు ద్వారా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. జగన్ ప్రభుత్వంలో అసెంబ్లీకి విలువ లేదని, ఐపీఎస్, ఐఏఎస్‌లు నలిగిపోయారన్నారు.

ALSO READ: వైసీపీ అరాచకం, అడ్డంగా దొరికిన పిన్నెల్లి, డీజీపీకి ఈసీ సమాచారం

Advertisement

ఉద్యోగస్తులు ఎప్పుడైనా తిరగబడితే ఆ ఎన్నికల్లో అధికార ప్రభుత్వం విజయం సాధించిన సందర్భాలు లేవన్నారు రఘురామకృష్ణరాజు. జగన్ చాప్టర్ క్లోజ్ అయ్యిందన్నారు. కూటమి 125 సీట్లలో తప్పకుండా విజయం సాధించడం ఖాయమన్నారు. పిన్నెల్లి విధ్వంసం కళ్లకు కట్టినట్టు మీడియా చూపించిందని, ఆయన మంచి సౌమ్యుడంటూ సీఎం జగన్ చెప్పడాన్ని తనదైనశైలిలో వ్యాఖ్యానించారాయన.

అంతకుమందు విజయనగరం వచ్చిన రఘురామకృష్ణరాజు పైడి అమ్మవారిని సందర్శించుకున్నారు. అటు విశాఖ వెళ్లి టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో ముచ్చటించారు.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×