E-Paper
Advertisement

Jagan : కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ .. లబ్ధిదారులు ఎంతమందంటే.?

Jagan : కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ .. లబ్ధిదారులు ఎంతమందంటే.?
Advertisement

Jagan : వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నగదు జమ చేశారు. జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మందికి రూ.87.32 కోట్ల ఆర్థికసాయాన్ని అందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి జగన్‌ నగదు జమ చేశారు.

బాల్యవివాహాలను నివా­రిం­చడంతోపాటు పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు, ముస్లిం కోసం వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది.

Advertisement

కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందే లబ్ధిదారులకు పదో తరగతి ఉత్తీర్ణతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.

వివాహమైన 30 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను ధ్రువీకరిస్తారు. ఏటా ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్‌లో లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాల్లో, అదే కులంలోని యువకులను వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

Advertisement

ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు అందిస్తారు. మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు, వారు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు ఇస్తారు. దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల ఆర్థికసాయం అందిస్తారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×