BigTV English

IPL : సొంతగడ్డపై హైదరాబాద్ కు షాక్ .. ఉత్కంఠ పోరులో కోల్ కతా విక్టరీ…

IPL : సొంతగడ్డపై హైదరాబాద్ కు షాక్ .. ఉత్కంఠ పోరులో కోల్ కతా విక్టరీ…


IPL : ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సొంతగడ్డపై ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్ కతా జట్టులో కెప్టెన్ నితీశ్ రాణా (42), రింకూ సింగ్ (46) రాణించారు.

హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ , నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, మార్ క్రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు.


172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. కెప్టెన్ మార్ క్రమ్ (41), హెన్రిచ్ క్లాసెన్ (36) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేసింది.

హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్ లో 9 పరుగులు మాత్రమే చేయాలి. కానీ 3 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడోతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లలో శార్ధుల్ ఠాకూర్, వైభవ్ ఆరోరా రెండేసి వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్ ను అద్భుతంగా వేసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×