E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట
Advertisement

Keralam: ట్రీట్‌మెంట్ తర్వాత కేరళం నుంచి వచ్చే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడి ప్రజలు చూపిన ఆధరాభిమానులు తనను కదిలించిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. పవన్ పోస్టుపై స్పందించిన కేరళం సీఎం వీడీ సతీశన్ ధన్యవాదాలు తెలిపారు. మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నామని రాసుకొచ్చారు.

కేరళం నుంచి వస్తూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌

ముంబైలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఆ భుజానికి చికిత్స కోసం కేరళం వెళ్లారు. డాక్టర్‌ సీతారామ్‌ వద్ద ఆయుర్వేదిక్‌ చికిత్స తీసుకున్నారు. చికిత్స పూర్తి తర్వాత కేరళం నుంచి ఏపీకి తిరిగి వచ్చే సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కేరళం పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మూడువారాల పాటు సాగిన చికిత్స సమయంలో కేరళం ప్రజల ఆప్యాయత, ఆదరణ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించినట్లు రాసుకొచ్చారు. తనకు ఇది కేవలం చికిత్స కాలం కాదని.. స్వస్థత, ప్రశాంతత, మధుర జ్ఞాపకాల సంపాదించుకునే సమయమని మనసులోని మాట బయటపెట్టారు.

పవన్ పోస్టుకు సీఎం సతీశన్ మనసులోని మాట

Advertisement

కేరళంలో ఉన్న సమయంలో త్రిప్రయార్ శ్రీరామస్వామి, గురువాయూర్ శ్రీకృష్ణ, మమ్మియూర్ శ్రీ మహాదేవ్, చెట్టికుళంగర శ్రీ భగవతి అమ్మ ఆలయాలను దర్శించుకున్నారు. శతాబ్దాల చరిత్ర, సంప్రదాయాలతో ఆలయాల దర్శనం తాను ఎంతో ప్రశాంతతను, భక్తి భావాన్ని పొందానన్నారు. కేరళ ఆలయాలు మన ప్రాచీన నాగరికత, వారసత్వానికి సజీవ ప్రతిరూపాలని అభివర్ణించారు పవన్ కల్యాణ్. తన పర్యటన సజావుగా సాగేందుకు సహకరించిన కేరళ సీఎం వీడీ సతీశన్, డీజీపీ, పోలీసు బృందాలు, త్రిశూర్, అలప్పుజ, కొచ్చి జిల్లా యంత్రాంగాలకు ధన్యవాదాలు తెలియజేశారు. స్టేట్ ప్రోటోకాల్ విభాగం అందించిన సహకారం, ఏర్పాట్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి దశలో భద్రత, సౌకర్యాల విషయంలో చూపిన వృత్తిపరమైన శ్రద్ధను ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

ALSO READ: బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

Advertisement

పవన్ కళ్యాణ్ పోస్టుకు కేరళం సీఎం వీడీ సతీశన్ రియాక్ట్ అయ్యారు. విశ్రాంతి తీసుకోవడానికి, చికిత్స కోసం తమ రాష్ట్రానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ప్రజల ఆప్యాయత, చారిత్రక ఆలయ దర్శనాలు, ఆయనకు శాంతి అందించాయని తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో మరోసారి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నామని, పవన్ పూర్తిగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ఎక్స్‌లో రాసుకొచ్చారు కేరళం ముఖ్యమంత్రి.

 

 

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

Big Stories

Advertisement
×