E-Paper
Advertisement

Nandigama News : రోడ్డు విస్తరణ.. విగ్రహాలు తొలగింపు.. నందిగామలో పొలిటికల్ హీట్..

Nandigama News : రోడ్డు విస్తరణ..  విగ్రహాలు తొలగింపు.. నందిగామలో పొలిటికల్ హీట్..
Advertisement
Nandigama latest news in telugu

Nandigama latest news in telugu(AP updates) :

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్డు విస్తరణ పనులు పొలిటికల్ హీట్ ను పెంచాయి. గాంధీ సెంటర్‌లో మహనీయుల, రాజకీయ నేతల విగ్రహాల తొలగింపు పెనుదుమారం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌, అబ్దుల్‌ కలామ్, రాజీవ్‌ గాంధీ, ఎన్టీఆర్‌, గుర్రం జాషువా, దేవినేని వెంకట రమణ, తంగిరాల ప్రభాకరరావు విగ్రహాలను మున్సిపల్ అధికారులు తొలగించారు.

ఈ విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో వద్ద ఉన్న టాయిలెట్‌ల పక్కన ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహనీయులకు కనీస గౌరవం ఇవ్వరా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం ఏంటని నిలదీస్తున్నారు.

Advertisement

నందిగామ గాంధీ సెంటర్ లో విగ్రహాల తొలగింపుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అభ్యంతరం తెలిపారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా అక్కడ విగ్రహాలు ఉన్నాయన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైసీపీ నేతల ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు విగ్రహాలను తొలగించారని మండిపడ్డారు.

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే అక్కడ ఉంచడాన్ని దేవినేని ఉమా తప్పుపట్టారు. మిగిలిన విగ్రహాలను తొలగించి మహనీయులను అవమానించారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే విగ్రహాలను మళ్లీ అక్కడే పెడతామని స్పష్టం చేశారు. నిరసన తెలిపేందుకు నందిగామ వెళుతుండగా దేవినేని ఉమాను గొల్లపూడిలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

నందిగామ టీడీపీ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద పోలీసులు భారీ మోహరించారు. మున్సిపల్ కమిషనర్ ను కలిసి విగ్రహాల తొలగింపుపై మాట్లాడేందుకు వెళుతుండగా సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తంగిరాల సౌమ్య రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే విగ్రహాల తొలగింపు చేపట్టామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

Related News

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

Big Stories

Advertisement
×