E-Paper
Advertisement

Vegetables Rates: మొంథా తుపాను ఎఫెక్ట్.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. వినియోగదారుల జేబుకు చిల్లు

Vegetables Rates: మొంథా తుపాను ఎఫెక్ట్.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. వినియోగదారుల జేబుకు చిల్లు

Vegetables Rates: మెుంథా తుపాను తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తుపాను దెబ్బకు కూరగాయల ధరలు సైతం కొండెక్కాయి. పలు నగరాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్కెట్‌కు సరకు తక్కువగా రావడంతో ధరలు అమాంతం పెరిగి పోయాయి.

టమాటాలకు డిమాండ్

మొన్నటి వరకూ కిలో రూ.10 ధర ఉన్న టమాటాలు ఇప్పుడు కిలో రూ.50 చేరింది. 25 కిలోలు బాక్స్‌ రూ.1000 ధర పలుకుతుంది. ఇంటి ముందుకు వచ్చే సరికి కిలో టమాటా రూ.60లకు పైగానే ధర పలుకుతుంది. మొంథా తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో 171 ఎకరాల్లో కూరగాయ పంటలు నష్టం పోయాయి. టమాటాల కొరతతో వ్యాపారులు అనంతపురం, చిత్తూరు, మదనపల్లి, కర్నూలు, డోన్‌, కర్ణాటక చంతామణి, కోలారు ప్రాంతాలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

కార్తీక మాసం ఎఫెక్ట్

కార్తీక మాసం కావడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. గతంలో రోజుకు 1200 బాక్స్‌ల కూరగాయలు మార్కెట్‌కు రాగా, ప్రస్తుతం 800 బాక్స్‌లు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. వారం క్రితం టమాటా బాక్స్‌ ధర రూ.500 ఉండగా, ప్రస్తుతం రెట్టింపు అయిందంటున్నారు. మునగకాడలు దిగుబడి లేకపోవడంతో చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

Also Read: Buddha Venkanna: లిక్కర్ కేసులో జగన్‌తో లింక్స్ .. బుద్దా వెంకన్న సంచలనం

కూరగాయల ధరలు

అయ్యప్ప భక్తుల అన్నదాన కార్యక్రమాలు పెరగడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 17,500 ఎకరాల నుంచి 30,000 ఎకరాల వరకు కూరగాయల సాగు చేస్తుంటారు. తుపాను వల్ల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో టమాటాకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గోరు చిక్కుడు కిలో రూ.25 నుంచి రూ.60కి పెరిగింది. చిక్కుడు కిలో రూ.80, వంకాయ కిలో రూ.70, కాకరకాయ కిలో రూ.50, బెండకాయ కిలో రూ.40, బీరకాయ కిలో రూ.70, బీన్స్‌ కిలో రూ.60, క్యాప్సికం రూ.60, క్యాబేజీ రూ.30, కొత్తి మీర రూ.30, పూదీన రూ.80 పలుకుతుంది. ఆలూ కిలో రూ.40కు చేరింది. ధరలు పెరగడంతో వినియోగదారుడి జేబుపై భారం పడుతుంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×