Big Stories

Tirumala Tirupati: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..!

Crowd of Devotees has Increased in Tirumala: ఏపీలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. అయితే, స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, రానున్న రోజుల్లో తిరుమల క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

ఓ వైపు వేసవి సెలవులు కావడం.. మరోవైపు ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News