E-Paper
Advertisement

YCP Ex MLA Karanam Dharmasri: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..

YCP Ex MLA Karanam Dharmasri: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..
Advertisement

YCP EX MLA Karanam Dharmasri On His Defeat: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమయ్యింది జగన్ పార్టీ. అయితే ఇప్పుడా పార్టీ ఓటమికి కారాణాలు వెతుక్కుంటోంది. ఒక్కొరుగా బయటకు వచ్చి ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.

తాజాగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయినట్లు చెప్పారు. బీన్ రహదారి గోతులే తన ఓటమికి ప్రధాన కారణమని.. జగన్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. జగన్ చూపిన నిర్లక్ష్యం వల్లే చోడవరం ఓటర్లు తనని ఓడించారన్నారు ధర్మశ్రీ. దాదాపు రూ. 2 కోట్ల సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టానని.. కూటమి ప్రభుత్వం ఆ డబ్బలు ఇస్తుందో లేదోనని అన్నారు.

Advertisement

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఓటమి గురించి మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామని అందుకే ప్రజలు తమను గద్దె దించారన్నారు. అవే తప్పులు చేస్తూ అదే తీర్పును కోరుకుంటారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారాయన.

ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వస్తే వైసీపీ సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీటు, జడ్పీటీసులు వారికి స్వాగతం పలకాలని తెలిపారు. వారికి ఆహ్వానం పలికి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం వారి ఇష్టం అని అన్నారు.

Advertisement

Also Read: రాజంపేట మేడా.. మల్లిఖార్జునరెడ్డిపై చంద్రబాబు ఫోకస్

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ వైసీపీ తరఫున పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు చేతిలో 42189 ఓట్ల మెజార్టీతో ఘోరంగా ఓటమి చవిచూశారు.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×