BigTV English
Advertisement

YCP Ex MLA Karanam Dharmasri: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..

YCP Ex MLA Karanam Dharmasri: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..

YCP EX MLA Karanam Dharmasri On His Defeat: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమయ్యింది జగన్ పార్టీ. అయితే ఇప్పుడా పార్టీ ఓటమికి కారాణాలు వెతుక్కుంటోంది. ఒక్కొరుగా బయటకు వచ్చి ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.


తాజాగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయినట్లు చెప్పారు. బీన్ రహదారి గోతులే తన ఓటమికి ప్రధాన కారణమని.. జగన్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. జగన్ చూపిన నిర్లక్ష్యం వల్లే చోడవరం ఓటర్లు తనని ఓడించారన్నారు ధర్మశ్రీ. దాదాపు రూ. 2 కోట్ల సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టానని.. కూటమి ప్రభుత్వం ఆ డబ్బలు ఇస్తుందో లేదోనని అన్నారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఓటమి గురించి మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామని అందుకే ప్రజలు తమను గద్దె దించారన్నారు. అవే తప్పులు చేస్తూ అదే తీర్పును కోరుకుంటారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారాయన.


ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వస్తే వైసీపీ సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీటు, జడ్పీటీసులు వారికి స్వాగతం పలకాలని తెలిపారు. వారికి ఆహ్వానం పలికి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం వారి ఇష్టం అని అన్నారు.

Also Read: రాజంపేట మేడా.. మల్లిఖార్జునరెడ్డిపై చంద్రబాబు ఫోకస్

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ వైసీపీ తరఫున పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు చేతిలో 42189 ఓట్ల మెజార్టీతో ఘోరంగా ఓటమి చవిచూశారు.

Tags

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×