Big Stories

Vizag students suicide: ఫ్యాకల్టీ వేధింపులు.. భవనం పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్..

Diploma student suicide at Vizag
Diploma student suicide at Vizag

Vizag students suicide news(Latest news in Andhra Pradesh): విశాఖలో దారుణం జరిగింది. డిప్లొమా చదువుతున్న ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. కాలేజీ యాజమాన్యం, స్టూడెంట్స్ లైంగిక వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుంటుబసభ్యులకు సూసైడ్ లేఖలో పేర్కొంది.

- Advertisement -

కొమ్మాది ప్రాంతంలో ఉండే చైతన్య ఇంజనీరింగ్ రూప శ్రీ అనే విద్యార్థిని డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుంది. కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి కళాశాల భవనం పైనుంచి దూసి సూసైడ్ చేసుకుంది. కళాశాల ఫ్యాకల్టీ అసభ్యంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుడడంతో తానకు వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన లేఖలో రాసింది.

- Advertisement -

కాలేజీలో ఏదైనా సమస్య అయితే ఫ్యాకల్టీతో చెప్పొచ్చు కానీ ఫ్యాకల్టీనే చేస్తే ఇంకెవరికి చెప్పగలం నాన్న అని లేఖలో పేర్కొంది. ఫ్యాకల్టీ చాలా చండాలంగా ప్రవర్తిస్తున్న ఫోటోలను తీసి బెదిరిస్తున్నారు. తప్పుచేసే స్టూడెంట్స్ ని సరిచేయాల్సిన ఫ్యాకల్టీనే వారికి మద్దతుగా నిలుస్తోందని.. ఇంక తన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వెల్లడించింది. నాతో పాటుగా మరికొంత మంది అమ్మాయిల ఫోటోలను తీసుకుని బెదిరిస్తున్నారని రూప తన తండ్రికి రాసిన లేఖలో తెలిపింది.

కళాశాలలో జరుగుతున్న ఈ విషయాన్ని పోలీసులకు గానీ చెప్తే.. తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని వెల్లడించింది. ఎవరో ఒకరు చస్తే గానీ ఈ విషయం ప్రపంచానికి తెలియదని.. అందుకే తనకు ఇంకో దారిలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు తన తండ్రికి తనలోని బాధని లేఖ ద్వారా తెలిపింది. నన్ను క్షమించండి నాన్నా.. నీకు నేను కాలేకపోయినందుకు అంటూ రూప లేఖలో పేర్కొంది. అయితే రూప ఆత్మహత్యపై పీఎం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News