E-Paper
Advertisement

Rain Alert: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

Rain Alert: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో  పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
Advertisement

Rain Alert: ఏపీపై అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ్టి నుండి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో వర్షాలు మరింత విస్తరించనున్నాయని అంచనా వేశారు.

పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
కడప, సత్యసాయి జిల్లా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలొచ్చాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Advertisement

Also Read: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
నవంబర్ 21నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కొత్త అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్ర వేటను తాత్కాలికంగా ఆపాలి. రైతులు పంటలు, ధాన్యాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×