E-Paper
Advertisement

Vinutha Kota: చేయని తప్పునకు జైలుకెళ్లాం.. నాపై కుట్రను ఆధారాలతో బయటపెడతా: వినుత కోటా

Vinutha Kota: చేయని తప్పునకు జైలుకెళ్లాం.. నాపై కుట్రను ఆధారాలతో బయటపెడతా: వినుత కోటా
Advertisement

Vinutha Kota: శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నాయకురాలు వినుత కోటా సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో.. ‘తెలుగింటి అడ బిడ్డగా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాం, త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది’ అని అన్నారు.

క్లీన్ చీట్ తో బయటకు వస్తాం

చేయని తప్పునకు జైలుకు వెళ్లామన్న బాధకంటే హత్య చేశామని చెప్పడమే తమను ఎంతో బాధించిందని వినుత కోటా అన్నారు. రాయుడు మృతిలో తమ ప్రమేయం లేదని భావించే 19 రోజుల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చీట్ తో బయటకు వస్తామన్నారు. కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నామని వినుత కోటాతెలిపారు. పవన్ అపాయింట్‌మెంట్ కోరామన్నారు.

Advertisement

డ్రైవర్ రాయుడు వీడియో వైరల్

శ్రీకాళహస్తి జనసేన మాజీ నేత కోటావినుత డ్రైవర్ రాయుడు పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినుత కోటా డ్రైవర్ రాయుడు చనిపోవడానికి ముందు రికార్డు చేసిన సుమారు 19 నిమిషాల సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రాయుడు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వినుత దంపతులను చంపాలని లేదా వారి ప్రైవేట్ వీడియోలు తీసి పంపిస్తే రూ. 30 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు ఆఫర్ చేశారని రాయుడు ఈ వీడియోలో చెప్పాడు.

Advertisement

Also Read: Pawan – Vijay: విజయ్‌‌కు పవన్ సలహా.. ఆ తప్పు చేయొద్దంటూ హితబోధ?

బెడ్రూమ్ లో కెమెరాలు

వినుత బెడ్రూమ్‌లో కెమెరాలు పెట్టి దొరికిపోయానని, అందుకే డ్రైవర్ ఉద్యోగం నుంచి తనను తొలగించారని రాయుడు తెలిపారు. ఈ పరిణామాల తర్వాత రాయుడు అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. రాయుడు హత్య కేసులో వినుత కోటను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనంతరం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టైన వారందరికీ బెయిల్ వచ్చింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×