E-Paper
Advertisement

Duvvada srinivas: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్‌.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి

Duvvada srinivas: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్‌.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి
Advertisement

Duvvada srinivas: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగు తోంది. తన భార్య వాణి చేసిన కామెంట్స్‌పై కౌంటరిచ్చారు ఆమె భర్త శ్రీనివాస. అంతేకాదు ఈ పంచాయతీ అంతా వైసీపీ అధిష్టానానికి తెలుసని, హైకమాండ్‌ని బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో దువ్వాడ శ్రీను-వాణి వ్యవహారం మరింత ముదిరిపాకాన పడింది.

శనివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసలు గుట్టు బయటపెట్టారు. తన ఫ్యామిలీ తనపై దాడి చేస్తుందని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ పంచాయతీ వైసీపీ అధిష్టానం వద్దకు వెళ్లిందన్నారు.

Advertisement

టెక్కలి టికెట్ విషయంలో హైకమాండ్‌తో నాలుగు సిట్టింగులు జరిగాయన్నారు. టికెట్ తనకు ఇవ్వాల్సిం దేనని వాణి డిమాండ్ చేసిందన్నారు. శ్రీను నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఒత్తిడి చేసిందన్నారు . తాను చెప్పినవి చేయకుంటే.. ఉరి వేసుకుని చస్తానంటూ పార్టీ హైకమాండ్‌ను వాణి బ్లాక్ మెయిల్ చేసిందని దుయ్యబట్టారు.

ALSO READ: మిడ్‌నైట్ హంగామా.. భార్యపై దాడికి దువ్వాడ శ్రీను యత్నం.. పోలీసుల జోక్యంతో?

Advertisement

కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలన్న దువ్వాడ శ్రీనివాస్, కుటుంబమే తనపై దాడి చేస్తోందని ఆవేదక వ్యక్తంచేశారు. ఓ కూతురికి పెళ్లి చేశాను.. మరో కూతురుకి మ్యారేజ్ చేయాల్సి ఉందన్నారు. మైనింగ్ క్వారీలను తన పేరు మార్చాలని వాణి తనపై ఒత్తిడి చేస్తోందని, తాను ఆమెను గుండెల మీద పెట్టుకున్నానని మనసులోని మాట బయటపెట్టాడు. వాణి తన గురించి పిల్లలకు చెడుగా చెప్పిందన్నారు.

తన భార్యకు టికెట్ ఇవ్వాలని జగన్‌కు చెప్పానని గుర్తు చేశారు దువ్వాడ శ్రీనివాస్. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా తన ఫ్యామిలీపై చర్చ జరుగుతోందన్నారు. వాణి ఆధ్వర్యంలో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, పార్టీకి వచ్చిన రిపోర్టు ప్రకారం తనకే అధిష్టానం టికెట్ కేటాయించిందన్నారు. తనకు గ్రానైట్ వ్యాపారమని, వచ్చిన సొమ్మంతా వాణికే ఇచ్చానని వివరించే ప్రయత్నం చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×