BigTV English

YS Jagan Petition : జగన్ పిటిషన్ పై విచారణ.. మంగళవారానికి వాయిదా

YS Jagan Petition : జగన్ పిటిషన్ పై విచారణ.. మంగళవారానికి వాయిదా

YS Jagan Petition in AP High Court : ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 11 స్థానాల్లోనే గెలిచిన వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే.. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. కనీసం 10 శాతం సభ్యులుండాలి. అంటే ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు సాధించిన పార్టీకే ఆ హోదా ఉంటుంది. వైసీపీకి ఉన్నది 11 ఎమ్మెల్యేలే కావడంతో.. అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.

దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ ఆ హోదాను ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ.. హై కోర్టును ఆశ్రయించారు. జగన్ వేసిన పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందో తెలియాలంటే మంగళవారం వరకూ వేచి చూడాల్సిందే.


Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×