E-Paper
Advertisement

Vontimitta Crime : భార్య, కూతురిని చంపి చేనేత కార్మికుడి ఆత్మహత్య.. అతనే కారణమంటూ..

Vontimitta Crime : భార్య, కూతురిని చంపి చేనేత కార్మికుడి ఆత్మహత్య.. అతనే కారణమంటూ..
Advertisement

Family Died due to Debts (Andhra news today) : రైతన్నలు, చేనేత కార్మికులు ఎంత కష్టపడినా వారి సంపాదన అంతంత మాత్రమే. చేసిన పనికి తగిన జీతం, ప్రతిఫలం వస్తే చాలు.. వారి ఆనందానికి అవధులుండవ్. అలాంటి చేనేత కార్మికుల రక్తం పిండుకుంటున్నారు అధికారులు. తమకు చెందిన భూమిని మరొకరిదంటూ రికార్డులు మార్చడంతో, చేసిన అప్పులు తీర్చలేక ఓ చేనేత కార్మికుడి కుటుంబం కన్నుమూసింది. వైఎస్సార్ జిల్లా రాజంపేటకు సమీపంలో ఉండే ఒంటిమిట్టలో జరిగిందీ విషాద ఘటన. భార్య, కూతురిని చంపి.. ఆ ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు(47) చేనేత కార్మికుడు. ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో భార్య పద్మావతి(41), కూతురు వినయ (17)తో కలిసి నివాసం ఉంటున్నాడు. చేసే పనికి తగిన సంపాదన లేక, కుటుంబ పోషణ గడవక అప్పుల పాలయ్యారు. తమకు ఉన్న భూమిని అమ్మి అప్పు తీరుద్దామంటే.. తమకు చెందిన 3.10 ఎకరాల భూమిని మరొక వ్యక్తి పేరిట ఉన్నట్లుగా స్థానిక ఎమ్మార్వో రికార్డులను తారుమారు చేశాడు. ఈ క్రమంలోనే సుబ్బారావు తన భార్య, కూతురిని చంపి.. ఒంటిమిట్ట రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో తమ చావులకు కారణం ఎమ్మార్వో సుబ్బారావేనని పేర్కొన్నాడు. లంచం తీసుకుని తమ భూమిని వేరేవారి పేరుమీద రికార్డులు మార్చినందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×