BigTV English
Advertisement

Fire Accident: గన్నవరం అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారులు

Fire Accident: గన్నవరం అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారులు

Fire Accident: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా  కృష్ణా జిల్లా గన్నవరంలోని అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగి, చూస్తుండగానే అనాథ ఆశ్రమం మొత్తం వ్యాపించాయి. వెంటనే అలర్టయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. మరో ఆరుగురు విద్యార్థులు మాత్రం గదిలోనే చిక్కుకున్నారు. పిల్లల అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు.. తలుపులు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు.


వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్‌ లైట్స్‌ అనాథ ఆశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్ధులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఆశ్రమం యాజమాన్యం విద్యార్ధులను  బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: జనసేనలోకి దువ్వాడ వాణి? క్లారిటీ ఇచ్చేసిందిగా..


అయితే వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీఎత్తున మంటలు చెలరేగడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏదైనా కుట్ర కోణం ఉందా? లేకపోతే మామూలుగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×