E-Paper
Advertisement

Jaya Badiga: యూఎస్ లో జడ్జిగా ఏపీ మహిళ.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి..

Jaya Badiga: యూఎస్ లో జడ్జిగా ఏపీ మహిళ.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి..
Advertisement

Jaya Badiga: భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ వీధుల్లో ఎగురవేసి తెలుగువారు చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికాలోని కాలిఫోర్నియా శాకమెంటో కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. అయితే ఆమె ప్రమాణ స్వీకారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కాలిఫోర్నియా కోర్టులో న్యాయమూర్తిగా జయ నియమితులయ్యారు. అయితే ఇలాంటి అత్యున్నత పదవి అలంకరించిన తొలి తెలుగు మహిళగా జయ చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ప్రమాణ స్వీకారం కూడా ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ..జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సంఘటన అక్కడ ఉన్న పలువురుని ఆశ్యర్చపోయేలా చేసింది. అంతే కాకుండా ఆమె సభను ఉద్దేశించి మాతృ భాషలో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా మన మూలాలు మరిచిపోవద్దనే విషయాన్ని ఆమె చాటి చెప్పారు.

Advertisement

Also Read: కౌంటింగ్ కాడికి పోవొద్దు.. మీడియాలో మాట్లాడొద్దు: హైకోర్టు

జయ బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా మాట్లాడే భాష అయిన తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అని తెలిపారు. ఆమె ప్రసంగం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న వారంతా ఆమెను ప్రశంసించారు.

Advertisement

ఏపీలోని విజయవాడలో పుట్టిన జయ బాడిగ హైదరాబాద్ లో పెరిగారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడే ఆమె న్యాయవిద్యను అభ్యసించారు. అయితే ఆమె గత రెండేళ్లుగా కమిషనర్ గా సేవలంచిన కోర్టులోనే జడ్జిగా నియమితురాలయ్యారు.

https://twitter.com/i/status/1793229557291725181

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×