E-Paper
Advertisement

Kadapa politics: కడపలో ఏం జరుగుతోంది? రెచ్చగొడుతున్నదెవరు?

Kadapa politics: కడపలో ఏం జరుగుతోంది? రెచ్చగొడుతున్నదెవరు?
Advertisement

Kadapa politics: కడప జిల్లాపై జనసేన ఫోకస్ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు అక్కడికి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.  వైసీపీ శ్రేణులు చేస్తున్న దురాగతాలను ఎండగట్టారు. ఒకానొక దశలో కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధీటుగా జగన్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కడపలోని స్థానిక ఆర్ట్స్ కాలేజ్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది. టైటిల్ మాత్రం కలాంగారు మనం మనకు వచ్చే కలలు నెరవేర్చుకునే దానికి కష్టపడ మన్నారు వేరే వాళ్లవి కావు అని రాసుంది. పవన్ ఫ్లెక్సీలో 21తో గేమ్ ఛేంజర్ అవ్వలేదని, 50 తీసుకోమని చెప్పినా వినలేదని అందులో ప్రస్తావించారు. ఇంతకీ 21 ఏంటి? 50 ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్లు దావోస్ వెళ్లారని, అక్కడ వాళ్లను పట్టించుకునే నాధుడు లేదన్నారు. కనీసం మీరు వెళ్లినా నాలుగు కంపెనీలు వచ్చేవంటూ అందులో ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నా మనకు మంచి పేరు ఉంటుందని, లేకపోతే ఆ దరిద్రం అంతా మన నెత్తికి చుట్టుకుందన్నా, తట్టుకోలేక పోతున్నామన్నా అని రాసి ఉంది.

డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీకి ధీటుగా వైసీపీ నుంచి జగన్ పేరిట ఆ పక్కనే మరొకటి వెలిసింది. జగన్ బ్రాండ్ అంటే ఏందో తెలుసునా మీకు అంటూ కాసింత రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి ఫ్యాన్ పార్టీ శ్రేణులు. వైసీపీ కార్యకర్త అంటేనే ఒక బ్రాండ్ అని, కూటమిని చీల్చాలనేది ఉండదు.. మాకు స్వలాభం అస్సలు ఉండదని ప్రస్తావించారు.

Advertisement

లీడర్లు వస్తూంటారు.. పోతుంటారు., పార్టీని నడిపించేది మా లాంటి కరుడు కట్టిన కార్యకర్తలే మా జగనన్న ఆస్తి.. సొంతం కూడా పేర్కొన్నారు. అలాగే కూటమికి వచ్చిన సీట్ల గురించి ప్రస్తావించారు. ఈ లెక్కన కడపలో ఏదో జరుగుతోందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

వీటిని చూసిన కొందరు నాయకులు మాత్రం ఈ ఫ్లెక్సీ గోలేంటి? అంటున్నారు. మరికొందరైతే కావాలనే ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పేవాళ్లే లేకపోలేదు. ఈ ఫ్లెక్సీ వార్ రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×