E-Paper
Advertisement

Kadapa News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. పది మంది విద్యార్థులకు అస్వస్థత

Kadapa News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. పది మంది విద్యార్థులకు అస్వస్థత
Advertisement

Kadapa News: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ విషాదం చోటు చేసుకుంది. వసంతపేట మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పది మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుండగా.. ఒక్కసారిగా కడుపునొప్పి వాంతులతో బాధపడటం మొదలు పెట్టారు. పరిస్థితిని గమనించిన పాఠశాల హెడ్మాస్టర్ వెంటనే స్పందించారు. అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Advertisement

విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ప్రాథమిక విచారణ జరిగింది. దీనికి కారణం మధ్యాహ్న భోజనంలో పెట్టిన కందిపప్పే అని తేలింది. నిల్వ ఉంచిన కందిపప్పుకు పురుగులు పట్టకుండా నివారించడానికి పప్పు బస్తాలలో కొన్ని గుళికలు వేశారు. భోజనం వండే క్రమంలో ఈ గుళికలతో పాటే కందిపప్పును ఉడకబెట్టారు. ఈ కారణంగా పప్పు పూర్తిగా కలుషితమైంది. కలుషితమైన పప్పు తిన్న విద్యార్థులు వెంటనే అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అజాగ్రత్తకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: Telangana Rising Global Summit: రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×