BigTV English
Advertisement

Jagan: జగన్, విజయమ్మ.. మరింత పెరిగిన దూరం.. ఇదే సాక్ష్యం

Jagan: జగన్, విజయమ్మ.. మరింత పెరిగిన దూరం.. ఇదే సాక్ష్యం

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వ్యవహారాలు ఇటీవల కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ కోసం అన్న జగన్ గెలుపుకోసం పని చేసిన షర్మిల, చివరకు ఆయనకే వ్యతిరేకంగా మారారు. తల్లి విజయమ్మ కూడా కూతురు షర్మిలవైపే ఉండటంతో ఆ కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా వైఎస్ కుటుంబాన్ని ముక్కలుగా చేసింది. కుటుంబ కలహాలు ఎలా ఉన్నా.. తల్లీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గవనే అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు అని నిరూపించారు జగన్. వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఈరోజు మేదరమెట్ల గ్రామానికి వచ్చారు జగన్. అదే సమయంలో ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా వచ్చారు. కానీ వారిద్దరి మధ్య గతంలో లాగా మాటలు లేవు. ఇంటి లోపల జగన్ ని తల్లి విజయమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నా.. జగన్ మాత్రం మునుపటిలాగా కనపడలేదు. విజయమ్మ అభిమానం తరగలేదని, అదే సమయంలో జగన్ నుంచి మాత్రం పెద్దగా రియాక్షన్ లేదని ఆ వీడియోలు, ఫొటోలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.


ఇక వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో కనీసం విజయమ్మ పేరు కూడా ప్రస్తావించక పోవడం విశేషం. కేవలం జగన్ వచ్చారు, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు, వెళ్లారు అని రాశారే కానీ, విజయమ్మ కూడా వచ్చారనే విషయాన్ని ప్రస్తావించలేదు. తల్లి, కొడుకు మధ్య మరింత దూరం పెరిగిందనడానికి ఇదే తాజా సాక్ష్యం. వైసీపీ, వైసీపీ మీడియా కూడా విజయమ్మను పూర్తిగా లైట్ తీసుకున్నట్టు స్పష్టమైంది.

గతంలో కుటుంబ కలహాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ ఘాట్ కి వెళ్లినప్పుడు తల్లి విజయమ్మ, కొడుకు జగన్ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. బిడ్డను ఆమె ఆశీర్వదించేవారు, దగ్గరకు తీసుకునేవారు. కానీ ఇప్పుడు తల్లీ కొడుకుల మధ్య కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాల్లో వాటాల గొడవలతో దూరం పెరిగింది. విజయమ్మ తన కుమార్తె షర్మిల దగ్గరే ఉంటున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కార్యక్రమాల్లో మాత్రమే జగన్, విజయమ్మ కలిసే సందర్భాలు వస్తున్నాయి. సరస్వతి పవర్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో వాటాల విషయంలో వీరి మధ్య గొడవ బాగా పెరిగింది. అందులో వాటాలు కావాలని షర్మిల కోర్టుకెక్కడం, ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ వాదించడం.. ఈ వ్యవహారంలో విజయమ్మ జోక్యం చేసుకుని కుమార్తె షర్మిలకు మద్దతుగా మాట్లాడటంతో వ్యవహారం మరింత ముదిరి పాకాన పడింది. అంటే జగన్ ఒకవైపు, షర్మిల-విజయమ్మ మరోవైపు అన్నట్టుగా ఈ వ్యవహారం నడుస్తోంది.

ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా విజయమ్మ, షర్మిలను శత్రువులుగానే చూస్తున్నారు. గతంలో ఎప్పటికైనా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒకటేనని చెప్పిన నేతలు కూడా ఇప్పుడు షర్మిల, విజయమ్మలపై విమర్శలు చేసేందుకు వెనకాడటం లేదు. కనీసం వైఎస్ఆర్ సతీమణిగా కూడా విజయమ్మను వారు గౌరవించడం లేదని తెలుస్తోంది. సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్ కి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడంతో విజయమ్మ కూడా వారికి శత్రువుగా మారిపోయింది.

కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆ రెండు వర్గాల మధ్య సఖ్యత లేదనే విషయం స్పష్టమైంది. ఓవైపు పార్టీనుంచి వెళ్లిపోతున్న నేతలు, మరోవైపు కుటుంబంలో కలతలు.. వీటన్నిటితో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్, అక్కడే ఉన్న తన తల్లి విజయమ్మతో మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. విజయమ్మ మాత్రం కొడుకుని దగ్గరకు తీసుకుంది.

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×