BigTV English
Advertisement

AP Telangana Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు పోలింగ్.. జూన్ 4న ఫలితాలు..

AP Telangana Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు పోలింగ్.. జూన్ 4న ఫలితాలు..

AP Elections 2024


AP Telangana Elections 2024 : ఏపీ, తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న నిర్వహించనున్నారు. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. జూన్ 16లోపు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్దిగంటలకు ముందే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే 24 మంది  లోక్ సభ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.


వైసీపీ ఇప్పటికే సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఇలా ఎన్నికల ప్రచారం చేపట్టిన జగన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించి పూర్తిగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఎన్నికలకు 57 రోజుల సమయం ఉంది.  అంటే ప్రచారానికి 56 రోజులు ఉంది. ఇక ఏపీలో ప్రచారం జోరుగా సాగనుంది.

Also Read : విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 21 సీట్లలో బరిలోకి దిగనుంది. బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ 17 లోక్ సభ స్థానాల్లో , బీజేపీ 6 స్థానాల్లో, జనసేన రెండు చోట్ల బరిలోకి దిగనుంది.

ఇటు తెలంగాణలో మే 13నే పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోరు జరగనుంది. ఇప్పటికే మూడు పార్టీలు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే 13నే పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో ప్రచారం పర్వం మొదలైంది. కాంగ్రెస్ ప్రజా దీవెన బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేపట్టారు. అటు బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.

Related News

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Big Stories

×