E-Paper
Advertisement

Ap Assembly inside agitation: వైసీపీ సభ్యుల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం..

Ap Assembly inside agitation: వైసీపీ సభ్యుల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం..
Advertisement

Ap Assembly inside agitation: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభ మయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌‌నజీర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాయి. అయితే సభలో వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చివరకు వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గాల్సివచ్చింది.

గవర్నర్ స్పీచ్ ముఖ్యమైన పాయింట్లు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని కొనియాడారు. విభజన వల్ల ఏపీకి భారీ నష్టం కలిగిందన్న ఆయన, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొని మార్పు కావాలని ఆకాంక్షించారని వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందన్నారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వ పాలనపై గవర్నర్ అబ్దుల్‌నజీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగావున్న తెలుగు ప్రజలు తీవ్రంగా కలత చెందారన్నారు. రివర్స్ టెండరింగ్‌తో తీవ్ర నష్టం జరిగిందని, ప్రతీకార రాజకీయాల వల్ల పెట్టుబడులు ఆగిపోయాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా  రాష్ట్ర ఆర్థికస్థితిపై కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. కొద్దిసేపటిలో తన ప్రసంగాన్ని ముగించారు గవర్నర్.

ALSO READ: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

Advertisement

మరోవైపు బీఏసీ స‌మావేశానికి వైసీపీ డుమ్మా కొట్టింది. అసెంబ్లీలో చ‌ర్చించాల్సిన అంశాల‌పై స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న సమావేశానికి వైసీపీ రాలేదు. టీడీపీ నుండి పయ్యావుల‌, జ‌న‌సేన నుండి నాదెండ్ల, బీజేపీ నుండి విష్ణుకుమార్ రాజు హాజ‌రయ్యారు.

 

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×