E-Paper
Advertisement

AP Schools: ఈ నెల 7న స్కూల్ కి రండి.. కానీ అలా రావద్దు.. ఇలా చేయవద్దు

AP Schools: ఈ నెల 7న స్కూల్ కి రండి.. కానీ అలా రావద్దు.. ఇలా చేయవద్దు
Advertisement

AP Schools: ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన పెద్ద పండుగ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద పండుగ అంటే ఏదో జాతర అనుకోవద్దు సుమా. ఇదొక విద్యార్థుల భవిష్యత్ కి సంబంధించిన పండుగ. అయితే ఈ పండుగకు అందరూ ఆహ్వానితులే కానీ, ఇలా రావద్దు, అలా చేయవద్దు అంటోంది ప్రభుత్వం. ఇంతకు ప్రభుత్వం ఏమి చెప్పిందో ఓ సారి తెలుసుకుందాం.

రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పాఠశాలలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే విద్యార్థులకు అందించే భోజనం పూర్తి నాణ్యత కలిగి ఉండాలని ఆదేశించారు. ఇలా పాఠశాలల అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Advertisement

తాజాగా అందులో భాగంగా పాఠశాలల అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం కావాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే ఈనెల 7వ తేదీన పెద్ద పండుగ పేరిట బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాపట్లలో జరిగే పెద్ద పండుగలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా అందరూ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, నాయకులు, దాతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, పాఠశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతేకాదు విద్యార్థుల్లో విద్యా సామర్థ్యం పెంచేందుకు ఏమి చేయాలి? చెడు వ్యసనాలకు లోను కాకుండా వారిలో ఎటువంటి చైతన్యం తీసుకురావాలన్నది కూడా కార్యక్రమం ఉద్దేశం. అంతేకాదు దాతలు కూడా స్వచ్చంధంగా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తే, ఆ నిధులు ఆ పాఠశాలకే ఉపయోగించాలని ప్రభుత్వ ఆలోచన.

Advertisement

Also Read: AP Mid Day Meal: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు కూడా ఆ పథకానికి అర్హులే

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే రాజకీయ పార్టీల నాయకులు మాత్రం, ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కండువాలను కప్పుకొని రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనే అవకాశం ఉందని, ఎవరు కూడా రాజకీయ ప్రసంగాలు కూడా చేయరాదని కూడా నిర్ణయించింది. పెద్ద పండుగలో కేవలం విద్యార్థులు, పాఠశాలలకు సంబంధించిన అంశాలపై మాట్లాడవచ్చని వివాదాస్పద కామెంట్స్ చేయరాదని కూడా కోరింది. మరి మీరు కూడా పెద్ద పండుగలో పాల్గొంటున్నారా.. అయితే ఇలా రావద్దు.. అలా మాట్లాడవద్దు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×